Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఆశా వర్కర్లకు నష్టం కలిగించే పరీక్ష నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలి

ఆశా వర్కర్లకు నష్టం కలిగించే పరీక్ష నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలి

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 06

మండలంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశ వర్కర్లకు నష్టం కలిగించే పరీక్ష పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం స్థానిక పి హెచ్ సి వైద్యాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల నాయకులు రుక్మిణీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తూ, సీనియార్టీ ఉన్న ఆశా వర్కర్లకు మళ్ళీ కొత్తగా పరీక్ష నిర్వహించి, ఆశాలజ్ఞాపకశక్తిని మళ్లీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్లు ఆశాలకు ఇస్తున్న పారితోషికాన్ని 18 వేల రూపాయలకు పెంచి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు చెల్లిస్తూ సర్కార్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, రాజేశ్వరి, కుమారి, లక్ష్మీ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page