![]()
ఆంధ్రప్రదేశ్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 09
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.సీట్ల పంపకాలలో కసరత్తు జరుగుతుంది.ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనీ సూచించినట్టు సమాచారం.దీంతో ఆయన కాకినాడ నుండి బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సర్వేలో అనుకూలంగా ఫలితాలు రావడమే అందుకు కారణమని వార్తలు వస్తున్నాయి.దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


