Tuesday, March 24, 2026
HomeHyderabadఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు ఇబ్బందుల్లో పడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోమవారం విమర్శించారు.

పొలాల్లో బిజీగా ఉండాల్సిన రైతులు ఇప్పుడు ఎరువుల దుకాణాల వెలుపల పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, యూరియా, డీఏపీలను పొందేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం సమన్వయ లోపం, పరిపాలనా వైఫల్యమే ఈ సంక్షోభానికి కారణమని ఆయన ఆరోపించారు. “ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం. ఇది రైతు పాలన కాదు రాక్షస పాలన. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన” అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పాలనను మునుపటి బీఆర్‌ఎస్‌ పాలనతో పోల్చుతూ.. రైతన్నకు పెట్టుబడికి రైతుబంధు, రైతన్న ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించిందన్నారు. రైతన్నకు ఎలాంటి యూరియా, ఎరువుల కొరత రాకుండా ఏప్రిల్, మే నెలలలో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేని సమయంలోనే నోడల్ ఏజెన్సీ మార్క్ ఫెడ్ కు ఆర్థిక సహాయం అందించి జూన్ నెల నాటికి 3 నుండి 4 లక్షల మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద మరో 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా చూసుకునేదన్నారు. దీనికి తోడు జులై, ఆగస్టు నెలలో కేంద్రం ఇవ్వాల్సిన కోటాను సమన్వయం చేసుకుని డ్రా చేసుకోవడం జరిగేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సమీక్షలు లేకపోవడం, కేంద్రం, రాష్ట్రం మధ్య కొరవడిన సమన్వయం మూలంగా రాష్ట్రంలో ఇప్పుడు యూరియా, డీఏపీ కొరత ఏర్పడిందన్న కేటీఆర్‌.. గత పదేళ్లలో ఎన్నడూ రైతన్నలు ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page