![]()
ఐటీసీ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్భద్ర ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ వితరణ
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
ఐటీసీ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్భద్ర, సారపాక వారి ఆధ్వర్యలో రోటరీ వారు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం ఎంఎల్ హెచ్ పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 500 లీటర్ల వాటర్ ట్యాంకును అందజేశారు. ఈ కార్య్రక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పాల్గొని ఐటీసీ రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెపుతూ ఈ సదుపాయం హెల్త్ కేర్ వారి దిన చర్యలకు ఎంతగానో ఉపయోగకరమని ప్రశంసించారు. అదే విధంగా హెల్త్ కేర్ సిబ్బంది చాలా ఆనందం వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో రో. చెంగల్ రావు, యాగి చంద్రశేఖర్, నాగ మల్లేశ్వరరావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుత 2023-24 రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రో. జయంత్ కుమార్ దాస్ మరియు సెక్రెటరీ కెవిఎస్ గోవిందరావు నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రోటరాక్ట్ సభ్యులు సబరిష్ పాల్గొన్నారు.


