![]()
జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
- జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి జి.భానుమతి
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో ఈ నెల 16వ తారీకున (శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు. యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చీటింగ్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాలుకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కుటుంబ తగాదాలు, బ్యాంకు కేసులు, టెలిఫోన్ కేసులు, కొట్టుకున్న కేసులు
ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


