![]()
డ్రైనేజి పనులకు ఎంపీపీ ముత్తినేని సుజాత శంకుస్థాపన
అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్
అశ్వాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ వెనుక వైపు నుండి ప్రధాన రహదారి డ్రైనేజికి అనుసంధానంగా ఎంపీపీ నిధులతో దాదాపు 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజి నిర్మాణ పనులను ఎంపీపీ ముత్తినేని సుజాత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్, ఏఈ చక్రధరా చారి, కాంగ్రెస్ మండల నాయకులు వలబోజు మురళీ కృష్ణ, చుంచు ప్రవీణ్, ఎండీ షఫీ, ఎండీ రఫీ, ఎస్కే అన్సారి తదితరులు పాల్గొన్నారు.


