![]()
-చండ్రుగొండ మండల అధ్యక్షుడు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 18
మండలంలో శనివారం చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారం గోవింద్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతాడని, అత్యధిక మెజార్టీ వస్తుందని ఎదురు చూస్తున్నాం అని తెలిపారు. మే 27 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించాలని, రెండో నెంబర్ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బొర్రా సురేష్, అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫసల్ బక్షి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్, తదితరులు పాల్గొన్నారు.


