Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి..

పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి..

Loading

పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి..

తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా..

రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య

మణుగూరు:

పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు
గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు సిపిఎం కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పేదలందరికీ ఇటిస్తాల ఇవ్వడం మరిచిందని విమర్శించారు పేదలందరికీ ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, మండలంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని వాటిని నిరుపేదలకు కేటాయించాలని ఆయన కోరారు అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం పేదలందరికీ 18 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని కోరారు, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఎం ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ పోరాటం ఉధృతం కాకముందే ప్రభుత్వ స్థలాలను ప్రజలకు పంచే కార్యక్రమం ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యు లు పిట్టల నాగమణి, మాచారపు లక్ష్మణరావు పల్లె చంద్రయ్య నాగమ్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page