![]()
ప్రజాపాలన గ్రామసభను సందర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
భద్రాచలం మండలం, కెసిఆర్ నగర్ యందు నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు నమోదు చేస్తున్న రిజిస్టర్ ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు భద్రాచలం ఆర్డీవో మంగీలాల్, భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, జాయింట్ సెక్రెటరీ రాజీవ్, జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ చుక్క సుధాకర్, చీపుర్ల శ్రీనివాస్, రహీం, యూత్ అధ్యక్షులు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, కోశాధికారి మాచినేని భాను, ఉపాధ్యక్షులు నాగేంద్ర, రైతుల శ్రీరామ్, మహిళా మండల అధ్యక్షురాలు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.


