![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09
మండలంలోని ప్రధాన కూడలిలో మూడవసారి ప్రధానమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆదివారం నరేంద్ర మోధీ చిత్రపటానికి మండల బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భోగి కృష్ణయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వారాధి సత్యనారాయణ, గుగులోత్(గడ్డం) శ్రీను, కొదుమూరి సత్యనారాయణ, చాపల మడుగు వెంకటేశ్వర్లు, నల్లమోతు రఘుపతిరావు, జంగా సత్యనారాయణ, ఇస్లావత్ రాందాస్, తదితరులు పాల్గొన్నారు.


