![]()
టేకులపల్లి మన భద్రాద్రి న్యూస్ ఫిబ్రవరి 04
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
మొక్కజొన్న రైతుల కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్రావును రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామానికి చెందిన రైతుల కేసులో లక్కినేని సురేంద ర్రావును ఇల్లెందు కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఆయనకు 14 రోజుల వరకు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


