![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని బోడు, మొక్కంపాడు గ్రామాల ప్రజలు, యువకులు ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బోడు పోలీస్ స్టేషన్లో గడచిన 2021 సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఆయన విధులు నిర్వర్తించారు. తన విధుల్లో నీతి నిజాయితీగా పనిచేశారని, ఆ ప్రాంతంలో విధులు నిర్వహించేటప్పుడు యువతకు మంచి మార్గం నిర్దేశించారని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అందరితో ఆప్యాయంగా ఉంటూ శాంతిభద్రతలకు ప్రాముఖ్యత ఇస్తూ, ప్రజా భద్రత ఎన్నడు మరవకుండా సేవ చేసిన యంగ్ డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.


