![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 15
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) లో ఇంటర్ ప్రవేశానికి మే 18 వరుకు గడువు పొడిగించినట్లు బుధవారం విద్యాలయాల ప్రాంతీయ సమన్వయ అధికారి టీవీ, రాజు, టేకులపల్లి ఏకలవ్య ప్రిన్సిపాల్ కె భద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవతరంలో అడ్మిషన్ పొందేందుకు 2023 – 2024 సంవత్సరంలో పదో తరగతి ఉతిర్ణులైన గిరిజన విద్యార్థులు అర్హులని వారు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో సీబీఏస్ఈ సిలబస్ బోధిస్తారని, ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీపంలోని ఏకలవ్య పాఠశాలల్లో దరఖాస్తులు అందజేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.


