![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 15
గుండాలలో బుధవారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ పాఠశాలలో ( సీబీఎస్ఈ సిలబస్) 10వ తరగతి విద్యార్థులు మొదటి బ్యాచ్ లోనే 100 కు 100% ఉత్తీర్ణత సాధించారని, ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇక ముందు కూడా పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటానికి అందరం కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులను కూడా ఇంకా కష్టపడి చదివేందుకు, వారిని ప్రోత్సహిస్తూ, ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు ఈఎంఆర్ఎస్ పాఠశాలకు అందించాలని కోరారు.


