![]()
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి మన భద్రాద్రి న్యూస్ జులై 22
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. మండలంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్ రైతువేదిక వద్ద 71 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగ భవాని, సీఐ తాటిపాముల సురేష్, ఎంపీపీ బానోత్ మౌనిక, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, బేతంపు సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఎంపీటీసీ సభ్యులు సరోజిని, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కోర సురేందర్ , మండల అధ్యక్షుడు దేవా నాయక్, బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు.


