![]()
హైదరాబాద్, మన భద్రాద్రి ఎడ్యుకేషన్ న్యూస్, మార్చి 12
తెలంగాణ SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.గతేడాది నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులలో ప్రత్యక్షం కావడంతో ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించింది.పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికి ఈ నిబంధన వర్తిస్తుంది.ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు.ప్రశ్నాపత్రాల లికేజీలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగిస్తారు.ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.


