![]()
దమ్మపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షునికి సన్మానం
అశ్వారావుపేట, మన భద్రాద్రి
అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయల నర్సి కి 24 గురువారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సన్మానం జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన కార్యక్రమంలో రాష్ట్రంలోని డోర్ టూ డోర్ క్యాంపెయిన్ లో 5వ స్థానంలో నిలిచిననందుకు గాను దమ్మపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయల నర్సి కి సన్మానం జరిగింది. సన్మానంతో పాటు సర్టిఫికెట్ ను తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షితో పాటు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, రాజ్యసభ ఎంపీ నాసిర్ హుస్సేన్ తదితరులు అందజేశారు. సన్మానం అనంతరం నర్సి మాట్లాడుతూ తన సేవలను గుర్తించినందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు, పార్టీ నాయకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మానం తనలో మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. పార్టీకి కట్టుబడి పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.


