Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemదేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన పాయం

దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన పాయం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జనవరి 21

మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయితీ రామాలయం వీధికి చెందిన శ్రీలత హోటల్ యజమాని వెంకట్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్ళి దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కటబోయిన నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కూచిపూడి బాబు, గణేష్ రెడ్డి, రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page