![]()
పినపాక, మన భద్రాద్రి న్యూస్, మే 15
స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ పీసీసీ సభ్యులు, గోపాలరావుపేట ప్రెసిడెంట్ బొలిశెట్టి నరసింహయ్య సతీమణి రాములమ్మ పార్థివ దేహానికి బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కన్వీనర్ భసీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


