![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Parliament Moonsoon Sessions) ప్రారంభమయ్యాయి. విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు పట్టుబట్టడంతో తొలిరోజే లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
మరోవైపు, రాజ్యసభలో ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్’ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం పొందగా.. లోక్సభ ఇప్పటివరకు మూడు సార్లు సభ వాయిదా పడింది. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు మొత్తంగా 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మొత్తంగా 15 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆ బిల్లులు ఇవే..
- ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు 2024: తొలిరోజే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు.
- సముద్ర రవాణా బిల్లు – 2024
- తీర ప్రాంత షిప్పింగ్ బిల్లు – 2024
- గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2024
- మర్చంట్ షిప్పింగ్ బిల్లు – 2024
- ఇండియన్ పోర్ట్స్ బిల్లు – 2025
- ఆదాయపు పన్ను బిల్లు – 2025
- మణిపూర్ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లు – 2025 (ఆర్డినెన్స్ స్థానంలో)
- జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు – 2025
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు – 2025
- పన్ను చట్టాలు (సవరణ) బిల్లు – 2025
- భూ వారసత్వ ప్రదేశాలు, భౌగోళిక అవశేషాలు (సంరక్షణ, నిర్వహణ) బిల్లు – 2025
- గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు – 2025
- జాతీయ క్రీడా పాలనా బిల్లు – 2025
- జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు – 2025


