![]()
ఆళ్లపల్లి, మన భద్రాద్రి
మండల కేంద్రంలోని మర్కోడు గ్రామానికి చెందిన వార్త విలేఖరి వెంకటేశ్వర్లు తన చరవాణిని కొద్ది రోజుల క్రితం పోగొట్టుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.మండల ఎస్సై రతీష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా ములకలపల్లి మండలంలో ఒక వ్యక్తి దగ్గర ఉండడంతో చరవాణిని రికవరీ చేసి మంగళవారం చరవాణి పోగొట్టుకున్న వెంకటేశ్వర్లకు ఎస్సై రతీష్ తిరిగి అప్పగించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటరెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


