![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జనవరి 26
గుండాల మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ రవీందర్ జనవరి 26 ఆదివారం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అందిస్తున్న ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.


