Monday, March 23, 2026
HomeNational Newsబిహార్‌లో 4 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించిన మోధీ

బిహార్‌లో 4 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించిన మోధీ

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: బిహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోధీ నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో రైల్ కనెక్టివిటీని ఈ రైళ్లు మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.

ఈ రైళ్లు మొత్తం నాలుగు మార్గాల్లో సేవలందించనున్నాయి. అవేంటంటే.. రాజేంద్ర నగర్ టర్మినల్ (పట్నా) నుంచి న్యూఢిల్లీ, బాపుధామ్ మోతిహరి నుంచి ఢిల్లీ (ఆనంద్ విహార్ టర్మినల్), దర్భంగా నుంచి లక్నో (గోమతీ నగర్), మాల్దా టౌన్ నుంచి లక్నో (గోమతీ నగర్). ఈ మార్గాల్లో కొత్త అమృత్ భారత్ రైళ్లు సేవలందిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. దీంతో బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభించే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే దేశంలో అత్యధిక అమృత్ భారత్ రైళ్లు మొదలయ్యే రాష్ట్రంగా బిహార్ నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page