Monday, March 23, 2026
HomeCrimeభారత్‌పై బంగ్లాదేశ్‌ భారీ కుట్ర.. ఎర్రకోట టార్గెట్.. ఐదుగురు అరెస్టు!

భారత్‌పై బంగ్లాదేశ్‌ భారీ కుట్ర.. ఎర్రకోట టార్గెట్.. ఐదుగురు అరెస్టు!

Loading

ఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు. వారు ఎర్రకోట ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని తెలిపారు. వారందరి వయస్సు దాదాపు 20-25 సంవత్సరాలు ఉంటుంది, వారు ఢిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారి నుండి కొన్ని బంగ్లాదేశ్ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా భారత్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఈ పరిణామం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

  • డమ్మీ బాంబును గుర్తించడంలో..

ఇదిలా ఉండగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించగా, ఆ డ్రిల్లో డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమైన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఈ ఘటన జరగడం భద్రతా లోపాలను సూచిస్తుంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఒక డమ్మీ బాంబుతో మఫ్టీలో ఎర్రకోటలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. ఈ డ్రిల్ను భద్రతా సిబ్బంది అప్రమత్తతను పరీక్షించడానికి నిర్వహించారు. గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసు అధికారులు (కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు) ఆ డమ్మీ బాంబును గుర్తించలేకపోయారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేస్తున్నారు. ఎర్రకోట మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా గురుగ్రామ్ పోలీసులు శనివారం నగరంలో అక్రమంగా నివసిస్తున్న పది మంది బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి బంగ్లాదేశ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని బహిష్కరించే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఇలాంటి అక్రమ ప్రవేశ ప్రయత్నాలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్నందున, అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన దేశంలో అక్రమ వలసలు మరియు వాటి వల్ల కలిగే భద్రతా సమస్యలపై మరోసారి చర్చను లేవనెత్తింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page