![]()
మండలంలో ఘనంగా గురు పౌర్ణమి సంబరాలు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే గుడి వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో కొలువై ఉన్న సాయిబాబా అనుగ్రహం కోసం మహిళలు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామంలోకి పల్లకి సేవ ద్వారా ఊరేగింపు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


