Monday, March 23, 2026
HomeSports Newsమాంచెస్టర్ టెస్టులో భారత్ కు దెబ్బ మీద దెబ్బ.. గాయం పాలైన స్టార్ బౌలర్

మాంచెస్టర్ టెస్టులో భారత్ కు దెబ్బ మీద దెబ్బ.. గాయం పాలైన స్టార్ బౌలర్

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సమయంలో ఈ ఆందోళన మరింత పెరిగింది.

మ్యాచ్‌ మూడో రోజు బుమ్రాకు గాయం అయ్యింది, దీని ప్రభావం టీమిండియాపై పడింది. ఫలితంగా ఇంగ్లండ్ 500 పరుగులకు పైగా భారీ స్కోరు సాధించింది. బుమ్రాకు ఈ గాయం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం మెట్లు ఎక్కుతున్నప్పుడు జరిగిందని బౌలింగ్ కోచ్ వెల్లడించారు.మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జూలై 23న నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ రెండో రోజు టీమిండియా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందే ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు. బుమ్రా ఆడతాడా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే, ఇద్దరు బౌలర్లు గాయపడటం, సిరీస్ ఫలితం తేలాల్సి ఉండటంతో బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించారు.

బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించడం వెనుక టీమిండియాకు ఒకే ఒక ఆశ ఉంది. స్టార్ బౌలర్ కచ్చితంగా ఏదో ఒక ప్రభావం చూపుతాడని అనుకున్నారు. అయితే, రెండో, మూడో రోజు మిగతా బౌలర్ల లాగే అతను కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ, బుమ్రాకు ప్రమాదం జరిగినప్పుడు టీమిండియా ఆందోళన పెరిగింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఒక విషయం బయటపెట్టారు. మూడో రోజు ఆట జరుగుతుండగా, బుమ్రా డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందకు వస్తున్నప్పుడు మెట్లపై కాలు బెణికిందని చెప్పారు. దీనివల్ల అతడు కొంతసేపు చాలా నొప్పితో ఉన్నాడని, కొత్త బంతితో బౌలింగ్ చేయలేకపోయాడని అన్నారు. అయితే, ఇది పెద్ద గాయమేమీ కాదని మోర్కెల్ స్పష్టం చేశారు.

కేవలం బుమ్రా మాత్రమే కాదు, మహ్మద్ సిరాజ్ కూడా ఫిట్‌నెస్‌తో ఇబ్బందులు పడినట్లు కనిపించింది. మోర్కెల్ మాట్లాడుతూ, రెండో కొత్త బంతిని తీసుకున్నప్పుడు టీమిండియాకు ఈ సమస్య తగిలిందని అన్నారు. “నిన్న (రెండో రోజు) బాగా లేదు కానీ, ఈ రోజు (మూడో రోజు) బౌలర్ల ప్రదర్శన కొంత మెరుగ్గా ఉంది. దురదృష్టవశాత్తు, ఇద్దరు బౌలర్ల గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి” అని మోర్కెల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. టీమిండియా 90 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకుంది. కానీ, ఒక్క ఓవర్ తర్వాతే బుమ్రా పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. చాలాసేపటి తర్వాత మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. సిరాజ్ కూడా కొత్త బంతితో దాదాపు 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు, కానీ ఈ సమయంలోనే గాయంతో డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 135 ఓవర్లు ఆడింది. అందులో బుమ్రా 28 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చివరి సెషన్‌లో బుమ్రాకు ఒక వికెట్ లభించింది. అయితే అతను 95 పరుగులు సమర్పించుకున్నాడు. అదేవిధంగా, సిరాజ్‌కు కూడా చివరి సెషన్‌లో ఒక వికెట్ దక్కింది, అయితే మూడో రోజు ముగిసే సమయానికి అతను 26 ఓవర్లలో 113 పరుగులు ఇచ్చాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page