![]()
ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలి
-జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి నది, ఎగువ నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం వేగంగా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేస్ వి. పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి నది 40.20 అడుగులు ఉండగా, ఎగువ నుండి నీరు భారీగా వస్తున్నందున భద్రాచలం వద్ద వరద ఉదృతి పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.


