Monday, March 23, 2026
HomeTechnologyయూపీఐ వాడే వాళ్లకు కేంద్రం బంపర్ ఆఫర్.. కొత్త రూల్స్

యూపీఐ వాడే వాళ్లకు కేంద్రం బంపర్ ఆఫర్.. కొత్త రూల్స్

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం యూపీఐ వాడే వారికి పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీరు గోల్డ్ లోన్, బిజినెస్ లోన్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించవచ్చు.

మీ లోన్ అకౌంట్‌ను కూడా యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం వచ్చింది. Paytm, PhonePe, Google Pay లాంటి యాప్స్ ద్వారా ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డుల నుంచి బిజినెస్ లోన్ పేమెంట్ల వరకు అన్నీ చేయగలరు. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యూపీఐ వాడే వారికి ఒక పెద్ద శుభవార్త చెప్పింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ద్వారా డబ్బులు పంపే నిబంధనల్లో పెద్ద మార్పులు చేసింది. ఇప్పుడు యూజర్లు గోల్డ్ లోన్, బిజినెస్ లోన్, ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించుకోవచ్చు. లోన్ అకౌంట్‌లను కూడా యూపీఐ అకౌంట్‌కు లింక్ చేసుకునే అవకాశం వచ్చింది. దీనివల్ల Paytm, PhonePe, Google Pay లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బిజినెస్ లోన్ పేమెంట్ల వరకు అన్నిటినీ చేయగలుగుతారు. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది.

యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను మరింత సులభంగా, వాడుకలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చడానికి NPCI ఇటీవల చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు పేమెంట్స్ పరిధిని పెంచినట్లు ప్రకటించింది. ప్రస్తుతం యూపీఐ వాడేవారు తమ సేవింగ్స్ అకౌంట్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లను మాత్రమే లింక్ చేయగలరు. వాటి ద్వారానే పేమెంట్లు చేయగలరు. కొన్ని రూపే క్రెడిట్ కార్డులు కూడా యూపీఐతో లింక్ అవుతాయి, కానీ అవి చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనతో, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ డబ్బులను కూడా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు.

యూపీఐ ప్రస్తుత నిబంధనల్లో P2M (పర్సన్ టు మర్చంట్) అంటే, వ్యక్తి నుంచి వ్యాపారికి డబ్బు పంపే సౌకర్యం ఉంది. కానీ, కొత్త నిబంధనలు వచ్చాక, కస్టమర్లు P2P (పర్సన్ టు పర్సన్) తో పాటు P2PM (పర్సన్ టు పర్సన్-మర్చంట్) లావాదేవీలు కూడా చేయగలరు. అంతేకాదు, మీరు నగదు కూడా తీసుకోవచ్చు.. అయితే, దీనికి NPCI కొన్ని నిబంధనలు పెట్టింది. ఉదాహరణకు: యూజర్లు ఒక రోజులో రూ.1 లక్ష వరకు మాత్రమే పేమెంట్ చేయగలరు. నగదు రూపంలో ఒక రోజులో రూ.10,000 మాత్రమే తీసుకోగలరు. P2P రోజువారీ లావాదేవీల పరిమితిని కూడా 20కి తగ్గించారు.

యూపీఐ ద్వారా మీరు ఏ రకమైన పేమెంట్లు చేయగలరు అనేది బ్యాంకు కూడా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే, బ్యాంకు ఆ లోన్ డబ్బులను కేవలం హాస్పిటల్ బిల్లులు లేదా ఎడ్యుకేషన్ ఫీజులు వంటి ముఖ్యమైన వాటికి మాత్రమే వాడేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంది. రూ.2-3 లక్షల బిజినెస్ లోన్ తీసుకున్న వారు, ఏ పేమెంట్ చేయాలన్నా పదే పదే బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇప్పుడు యూపీఐ ద్వారానే సులభంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇది డిజిటల్ పేమెంట్లను మరింత విస్తృతం చేసి, ఆర్థిక లావాదేవీలను మరింత వేగవంతం చేస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page