![]()
-రేషన్ కార్డు లేని వారికి తీపి కబురు
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 14
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులను అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.ఈ స్కీమ్ లో ఇప్పటివరకు 1,670 రకాల ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో 100 రకాల చికిత్సలను చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.


