![]()
గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 10
ఉమ్మడి మండల పరిధిలోని మామకన్ను ఉపకేంద్రంలో నూతనంగా 33 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసే పని నిమిత్తం గుండాల, ఆళ్లపల్లి మండలాలలో రేపు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 వరకూ విద్యుత్ అంతరాయం కలుగునని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేసింది.


