Monday, March 23, 2026
HomeTelangana Newsరేవంత్ సర్కార్ శుభవార్త.. వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు..

రేవంత్ సర్కార్ శుభవార్త.. వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు..

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన గొప్ప కార్యక్రమం ఆరోగ్యశ్రీ. ఉమ్మడి రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ పథకం అమల్లో ఉందంటే ప్రజల్లో దీనికి ఎంత మంచి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు కూడా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారిలో చాలా మంది ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..అనాథ పిల్లలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో పలువురు అనాథ చిన్నారులుకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. అనాథ పిల్లల రక్షణ, ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.అందుకే వారికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశామని తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, వైద్యశాఖ సహకారంతో మంచిర్యాల జిల్లాలోని 6 సంరక్షణ కేంద్రాల్లో ఉన్న 85 మంది అనాథ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. అలానే జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న ప్రతి అనాథ చిన్నారికి ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇకపై అనాథ చిన్నారులు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆసరా పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. అలానే రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికి డిజిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. వీటి రూపకల్పనకు సంబంధించి అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్‌కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీటిని మంజూరు చేస్తారని అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page