Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జారే

వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జారే

Loading

అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, జూలై 03

అశ్వారావుపేట మండలం, పాపిడిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్లో స్థానిక విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు మొక్కలపై అవగాహన కోసం క్విజ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను గుర్తించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ మొక్కల పెంపకం వలన స్వచ్ఛమైన గాలి, మనుషులకు కావలసిన ఆక్సిజన్ లభిస్తుందని, మొక్కల వలన ప్రకృతి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని, అడవుల వలన వర్షాలు సమృద్ధిగా కురవడం తద్వారా పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని, అలాగే అడవి జంతువులకు కూడా సరైన ఆహారం దొరికి గ్రామాలలోకి రాకుండా ఉంటాయని, అంతరించిపోతున్న అడవులకు దీటుగా మొక్కలు పెంచి భావితరాల వారికి ప్రాణదాతలుగా నిలవాలని, పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటే అడవులు చాలా అవసరమని తెలిపి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించి భావితరాలకు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page