![]()
వరద బాధితుల పట్ల స్థానిక యువతకు దిశానిర్దేశం చేస్తున్న భద్రాచలం ఆర్డీఓ
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, జులై 23
బూర్గంపహాడ్ మండల పరిధిలోని గోదావరి వరద పరిస్థితులపై, ప్రజల స్థితిగతులపై ఆరాతీస్తూ లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, సామాజిక బాధ్యతగా ఎప్పటికప్పుడు ప్రజలకు, బాధితులకు తోడ్పాటుగా నిలవాలని సంబధిత అధికారులతో కలిసి స్థానిక యువతకు భద్రాచలం ఆర్డీఓ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


