![]()
అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్, మే 19
మండలంలోని ఆమెర్ద గ్రామంలో ఇరుగు పెద్ద నర్సయ్య – అలివేలు దంపతుల కుమారుడైన ప్రశాంత్ – కీర్తిల వివాహ వేడుకలో ఆదివారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మండల ఎంపీపీ ముత్తినేని సుజాత పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


