Monday, March 23, 2026
HomeNational Newsశాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్, మార్చి 16

శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ అమెరికన్ ఏఐ రీసెర్చర్ మరియు పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాకిస్తాన్, గుజరాత్ అల్లర్లు, భారత విదేశాంగ విధానం, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్ ఎప్పుడూ శాంతి, పరస్పర సహకారాన్ని కోరుకుంటుందని, కానీ పాకిస్తాన్ నుంచి ప్రతిసారి శత్రుత్వమే ఎదురవుతుందని మోదీ వ్యాఖ్యానించారు.

2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, అది రెండు దేశాల సంబంధాల్లో కొత్త ప్రారంభం అవుతుందని ఆశించానని తెలిపారు. పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, కానీ వారి దేశం నిరంతరం ఉగ్రవాదం, అశాంతితో ఇబ్బంది పడుతోందని మోదీ అన్నారు.

పాకిస్తాన్‌తో దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమయ్యాయని మోదీ వెల్లడి . తన మొదటి పదవీకాలంలో పాకిస్తాన్‌తో బంధాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించానని మోదీ గుర్తు చేశారు. భారతదేశం తన విదేశాంగ విధానాన్ని స్పష్టంగా, నమ్మకంగా ప్రపంచానికి చాటింది అని చెప్పారు. అయితే వారు శాంతి మార్గాన్ని ఎంచుకోలేదని, భారత ప్రభుత్వ ప్రయత్నాలకు పాక్ అనూహ్యమైన ప్రతిస్పందన ఇచ్చిందని విమర్శించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావిస్తూ, ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను కొనియాడారు.
ట్రంప్‌తో తనకున్న బలమైన అనుబంధాన్ని కూడా మోదీ వెల్లడించారు.

2002 గుజరాత్ అల్లర్లకు ముందు కూడా రాష్ట్రంలో 250కి పైగా అల్లర్లు జరిగాయని మోదీ గుర్తు చేశారు. తన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తుందని స్పష్టం చేశారు. 2002 తర్వాత గుజరాత్‌లో ఒక్క అల్లరూ జరగలేదని మోదీ ధృవీకరించారు. తనపై అనేక ఆరోపణలు వచ్చాయి కానీ, చివరకు కోర్టులు తనకు క్లీన్ చిట్ ఇచ్చాయని తెలిపారు.

భారతదేశం శాంతికి కట్టుబడి ఉందని, ప్రపంచ వేదికపై బలమైన దేశంగా ఎదుగుతోందని మోదీ తెలిపారు.
భారతదేశం ఎవరి ముందూ తలవంచదని, తన విధానాల ద్వారా శక్తివంతమైన దౌత్యాన్ని ప్రదర్శిస్తోందని వివరించారు.

లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మోదీ పాల్గొని కీలక అంశాలపై స్పందించారు. భారత శాంతి ప్రయత్నాలకు పాక్ నుంచి శత్రుత్వమే వచ్చిందని విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ ధైర్యాన్ని, నాయకత్వాన్ని ప్రశంసించారు. 2002 గుజరాత్ అల్లర్లపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page