![]()
అధికారంలోకి రాగానే అందరికీ ఇల్లులు వస్తాయి
- పొంగులేటి సతీమణి మాధురి
చండ్రుగొండ, మన భద్రాద్రి
చండ్రుగొండ మండలంలో ఈరోజు మంత్రివర్యులు పొంగులేటి సతీమణి మాధురి విస్తృత పర్యటన చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మీ ప్రతి ఒక్క సమస్య నా తరఫున ప్రభుత్వానికి చేరవేస్తానని, కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేసి ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీని గెలిపించాలని, గెలిచిన వెంటనే హామీలన్నీ అమలుపరుస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామస్తులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.


