![]()
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్,
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఐషా మస్రత్ ఖనమ్ ఆదేశాల మేరకు ఇల్లందు మైనార్టీ స్కూల్ ఇల్లందు నందు 2024 – 25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 5వ తరగతి ప్రవేశం కొరకు ముస్లిం విద్యార్థులు 51, క్రిస్టియన్ 05, జైనులు 01, పార్సిలు 01, బౌద్ధులు 01, సిక్కులు 01, ఎస్సీలు 05, ఎస్టీలు 03, బిసిలు 10, ఓసిలు 02 పూర్తి చేసిన దరఖాస్తులను 18-01-2024 నుండి 06-02-2024 వరకు TMREIS.TELANGANA.GOV.IN నందు ఆన్లైన్ చేసుకోవాలని కోరారు. వివరాలు కొరకు 9110360408, 7331170863 నంబర్లు నందు సంప్రదించాలని కోరారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు విద్యార్థి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర వివరాలతో దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని తెలిపారు.


