![]()
అశ్వాపురం సీఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు
అశ్వాపురం మండల కేంద్రంలోని సెంటర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వాపురం పోలీస్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై లు సురేష్, తిరుపతిరావు మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, లైసెన్స్ లేని వారిపై, ఎల్ఈడి లైట్లు అమర్చిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేసి వారిపై కేసులు నమోదు చేశారు.


