![]()
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 10
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శనివారం 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే.సర్వీస్ ఆధారంగా జీతం పెరుగుదలకు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.సూపర్ వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్ల సర్వీస్ ఆధారంగా వేతనం పెంపుకు అంచనా వేశారు.ఉద్యోగుల పదేళ్ల సర్వీసును బట్టి రూ. 5,851 నుంచి రూ. 8,468 వరకు వారి జీతం పెరిగే అవకాశం ఉంది.30 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు రూ. 9,540 నుంచి రూ. 14,314 వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.పై స్థాయి అధికారులకు జీతం భారీగా పెరిగే అవకాశముంది.


