![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 28
ఉమ్మడి మండలాలైన గుండాల, ఆళ్లపల్లి మండలాలో శనివారం ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మామకన్నులోని 33 కేవి ఫీడర్ పై మరమ్మత్తులు ఉన్నందున ఈ అంతరాయం కలుగనుందని, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని తెలిపింది.


