![]()
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు, అక్షరాభ్యాసం
టేకులపల్లి, మన భద్రాద్రి
టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామ పంచాయతీలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం తార ఆధ్వర్యంలో శ్రీమంతాలు మరియు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ బాలింతలు అంగన్వాడి సెంటర్లో భోజనాలు చేయాలని, ఆకుకూరలు పప్పు, పాలు, గుడ్లు, తినడం వలన రక్తం పెరుగుతుందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బి నిర్మల, సర్పంచ్ అజ్మీర బుజ్జి, పంచాయతీ కార్యదర్శి ఎన్ పవిత్ర, హెచ్ఎం జాన్సన్, అంగన్వాడి టీచర్లు పి రాజేశ్వరి, జి మంగ తాయారు, పి పద్మ, ఆశ వర్కర్లు జి చైతన్య, కే చంద్రకళ, పలువురు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.


