![]()
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో:
మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేటీఆర్ పై పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది.
ఈసీ నియమావళికి విరుద్ధంగా బాణసంచా కాల్చడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, సాక్షులందరూ పోలీసులేనని కేటీఆర్ తరఫు న్యాయవాది వివరించారు. చట్టపరంగా సరైన ఆధారాలు లేవని వెల్లడిస్తూ హైకోర్టు కేసును కొట్టివేసింది. దీంతో కేటీఆర్ కు భారీ ఊరట లభించినట్లు అయ్యింది.


