![]()
టేకులపల్లి లో మహాగణపతి శోభాయాత్ర.
శోభాయాత్రలో పాల్గొన్న డి.ఎస్.పి చంద్రభాను.
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06
టేకులపల్లి బోడు క్రాస్ రోడ్ సెంటర్ లో మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాధుని టేకులపల్లి ప్రజలు భక్తిశ్రద్దలతో, ప్రత్యేక నోములు,వ్రతాలతో పూజించారు.గడప గడపకు హారతులు పడుతూ, గణపతి శోభాయాత్రను శనివారం డోలువాయిద్యాలతో అంగరంగ వైభవంగా వరసిద్ది వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీలు, పురుషులు భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ఆకర్షణతో కనిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. ఇల్లందు టి.ఎస్.పి చంద్రభాను మరియు టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై ఏ రాజేందర్ లు కమిటీ సభ్యులు మరియు మహిళల కలిసి కోలాటం వేస్తూ మహాగణపతి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ కమిటీ వారు పోలీస్ సిబ్బందికి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు.


