Monday, March 23, 2026
HomeInternationalట్రంప్‌తో పాక్‌ ప్రధాని షరీఫ్‌ రహస్య భేటీ.. ఏం చర్చించారు..?

ట్రంప్‌తో పాక్‌ ప్రధాని షరీఫ్‌ రహస్య భేటీ.. ఏం చర్చించారు..?

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: దాయాది దేశం పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. అమెరికా పర్యటనలో ఉన్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో(Trump-Shahbaz Sharif) షెహబాజ్‌ షరీఫ్‌ భేటీ అయ్యారు.

వైట్‌హౌస్‌లోని(White House) ఓవల్‌ ఆఫీస్‌లో అంతర్గతంగా వీరి సమావేశం జరిగింది. ట్రంప్‌తో పాక్‌ ప్రధాని రహస్యంగా సమావేశమయ్యారు. మీడియాను అనుమతించలేదు. ఈ భేటీకి పాక్‌(Pakistan) ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇరువురు నేతలు ఏ అంశంపై చర్చించుకున్నారనే ఆసక్తి నెలకొంది. ఇక, ట్రంప్‌తో షెహబాజ్‌ షరీఫ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.

వివరాల ప్రకారం.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాక్‌ ప్రధాని షరీఫ్‌ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్‌కు ట్రంప్‌ స్వాగతం పలికారు. అనంతరం.. డొనాల్డ్‌ ట్రంప్‌, షహబాజ్‌ షరీఫ్‌ మధ్య సమావేశం జరిగిందని తెలుస్తోంది. ఇరువురు నేతలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య దైపాక్షిక ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతపై చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఈ సమావేశంలో వారితో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ కూడా ఉన్నారని సమాచారం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ప్రపంచ దేశాలపై ట్రంప్‌ వరుసగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని.. అమెరికా అధ్యక్షుడిని కలవడం గమనార్హం.

మరోవైపు ఇప్పటికే పాక్‌ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ అమెరికాలో వరుస పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. మునీర్ గతంలో జూన్, ఆగస్టు నెలల్లో అమెరికాలో పర్యటించారు. జూన్ పర్యటనలో మునీర్‌కు ట్రంప్ వైట్ హౌస్‌లో విందు ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. ఆ తరువాత అమెరికా.. పాకిస్తాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, పాకిస్తాన్‌కు ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా అమెరికా అందించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page