Monday, March 23, 2026
HomeNational Newsనేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన

నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (ఆగస్టు 10) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా ముందుగా మోడీ.. బెంగళూరు- బెళగావి, అమృత్‌సర్‌- శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్‌-పూణె మధ్య మూడు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ఎల్రక్టానిక్‌ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేసి, మోడీ ప్రసంగిస్తారు. తరువాత పర్యటన ముగించి ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page