![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09
మండలంలో ఇటీవల కాలంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన తోటకూరి అనంతమ్మ, దాస్ తండా గ్రామపంచాయతీ లచ్చతండా గ్రామానికి చెందిన బానోత్ ద్వాళిల దశదిన కర్మలలో పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి, నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఓదార్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో
కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యానాయక్, ఈది గణేష్, మధురెడ్డి, పూణ్య, తదితరులు పాల్గొన్నారు.


