![]()
పహానిల ద్వారా రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి
చండ్రుగొండ, మన భద్రాద్రి, జూలై 22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి వరి కోటి వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు లేని రైతులు పహాని నక్కల ద్వారా బ్యాంకు రుణాలు తీసుకున్నారు. వారి రుణాలుమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయలేదు. రాష్ట్రంలో పానీల పహానీళ్ల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరి రైతుల రుణాలు కూడా మాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసి పేద రైతులని ఆదుకోవాలని వారు కూడా ఆరుగాలం కాయ కష్టం చేసి పంటలు పండించి పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడినది వారి రుణాలు కూడా మంచి మనసుతో ముఖ్యమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు ,పరిశీలించి రాష్ట్రంలో ఉన్న పహానిల ద్వారా తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పహానిల ద్వారా తీసుకున్న రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి రైతులందరినీ ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు కారం వెంకటేష్, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య ,డి బాలు ,టి బీముడు ,తోలం వెంకటేశ్వర్లు, పెద్ద వెంకన్న ,కె రామారావు, పెద్దమ్మ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.


