![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్:: ప్రపంచంలో పులుల జనాభా అత్యధికంగా భారతదేశంలోనే ఉంది. 1972 వరకు మన జాతీయ జంతువు సింహం ఉండేది. ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వీటిని సంరక్షించేందుకు 1973లో నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘ప్రాజెక్టు టైగర్’ను ప్రారంభించింది.
అదే ఏడాది నుంచి పులి (పాంథెరా టైగ్రిస్) మన జాతీయ జంతువుగా మారింది. దేశంలో 1900 సంవత్సరం నాటికి 40వేలు ఉన్న పులుల సంఖ్య 1972కు 1800కు తగ్గిపోయింది.


