![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10
మండలంలోని బెండలపాడు గ్రామంలో యుపిఎస్ బెండలపాడు పాఠశాల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఎంఈఓ ఆదేశాల మేరకు ఇంటింటి ప్రతి ఇంటికి వెళ్లి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఏ తరగతి చదువుతున్నారో పూర్తి వివరాలు నమోదు చేశారు. సర్వే నిర్వహించి కొంతమంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే అనురాధ, డీ నరసింహరావు, గ్రామస్థులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


