![]()
బడ్జెట్ విషయంలో మళ్ళీ వివక్ష చూపిన బీజేపీ..
బిఆర్ఎస్ యువజన నాయకులు కుప్పాల నిరంజన్ కుమార్
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 24:
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి మొండిచేయి చూపడం బాధాకరమని బుధవారం చర్ల బీఆర్ఎస్ యవజన నాయకులు కుప్పాల నిరంజన్ కుమార్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని రాష్ట్రాలకి అధిక ప్రాధాన్యతఇస్తూ అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించడంలో పెద్దపీట వేశారని,తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన బడ్జెట్ శూన్య మని అన్నారు.తెలంగాణ ప్రాంతం నుండి 8 మంది బిజేపి ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులున్నారని,తెలంగాణకు అన్యాయం జరయగుతున్న బడ్జెట్ కేటాయుంపులపై నోరుమెదకపోవడం భాదకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి వేల కోట్ల బడ్జెట్ కేటాయుంచి తెలంగాణ కు విద్యా, వైద్యం, ప్రాజెక్టులకు బడ్జెట్ గురించి ప్రస్తావన లేకపోవడం,తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం, తెలంగాణ పట్ల వివక్ష చూపటం అత్యంత దారుణమని అన్నారు.


